ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Friday 10 August 2012

సుభాషితాల సంకలనం 'భావన ' నాలుగవ ముద్రణ








మా యువభారతి పూర్వ అధ్యక్షులు కీ.శే.ఇరివెంటి కృష్ణమూర్తి గారి జయంతి కృష్ణాష్టమి రోజే.గత కొన్ని సంవత్సరాలుగా ఆయనపేరున ప్రముఖులకు స్మారక పురస్కారం ఇవ్వడం జరుగుతోంది. ఇవాళ హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్రభాషానిలయం లో  ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ పూర్వ అధిపతి డాక్టర్ శ్రీమతి.సుమతీ నరేంద్ర గారికి ఈ ఏటి ఆ పురస్కారం దాక్టర్.సి.నారాయణరెడ్డి గారి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది. అలాగే ఆచార్య ఎస్.వి.రామారావ్ గారికి సంస్థ ప్రస్తుత గౌరవ అధ్యక్షులు దాక్టర్.తిరుమల శ్రీనివాసాచార్య గారి పేరిటి అవార్డ్ బహూకరించారు.ఈ సందర్భంగా గతంలో యువభారతి ప్రచురించిన ఇరివెంటి వారు సంకలించిన సుభాషితాల సంకలనం 'భావన ' నాలుగవ ముద్రణ ఆవిష్కరించడం జరిగింది. యువభారతి ప్రస్తుత ప్రధాన సంపాదకునిగా నేను ఈ పునర్ముద్రణ కు రాసిన ముందుమాట మీ ముందు వుంచుతున్నాను. 


పై ఇమేజ్ మీద క్లిక్ చేస్తే పెద్ద సైజ్ లో చదవవచ్చు 

No comments:

Post a Comment